సెన్సార్ పూర్తి చేసుకున్న వెంకీ మామ

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’ మొదట్నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

మామఅల్లుళ్లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుందని ప్రేక్షకులు కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారు.

దీనికి తగ్గట్టుగా ఈ చిత్ర పోస్టర్లు, టీజర్లు ఉండటంతో ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు సినీ ప్రేక్షకులు.

ఇక ఈ సినిమాను డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.

వెంకీ మామ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.ఈ సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని సెన్సార్ బోర్డు సభ్యులు కితాబిచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

తమ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి కొదువ లేదని వారు అన్నారు.వెంకటేష్, నాగచైతన్యలకు జోడీగా పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా నటిస్తున్నారు.

భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 13 వరకు ఆగాల్సిందే.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు.. సీఎం రేవంత్