‘నారప్ప’ కు గుమ్మడి కాయ కొట్టేశారు.. వెంకీ కనిపించలేదేంటో?

తమిళ సూపర్‌ హిట్‌ మూవీ అసురన్ ను తెలుగులో నారప్ప గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

తమిళంలో ధనుష్‌ హీరోగా నటించిన ఈ సినిమా ను తెలుగులో వెంకటేష్‌ చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను సురేష్‌ బాబు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

ధనుష్‌ పోషించిన పాత్రను సీనియర్ హీరో అయిన వెంకటేష్‌ ఎలా చేశాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లాక్ డౌన్‌ సమయంలోనే సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయాలని భావించారు.కాని కరోనా విజృంభించిన సమయంలో సినిమా షూటింగ్ ను ఆలస్యంగా పునః ప్రారంభించారు.

వెంకటేష్‌ చాలా విభిన్నమైన గెటప్‌ లో కనిపించగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా విడుదల తేదీని ఇటీవలే ప్రకటించారు.మరి షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సినిమా షూటింగ్‌ ముగిసింది అంటూ ప్రకటన వచ్చింది.

నారప్పకు గుమ్మడి కాయ కొట్టాం అంటూ స్వయంగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ టీం ప్రకటించింది.

సురేష్‌ బాబు ఉన్న ఒక ఫొటోను కూడా షేర్‌ చేశారు.అందులో వెంకటేష్‌ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ముందే వెంకటేష్‌ తన పోర్షన్‌ ను పూర్తి చేశాడా అనేది కొందరి అనుమానంగా ఉంది.

ఇక ఈ ఫొటోలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా కనిపించక పోవడంతో చివరి సన్నివేశాలకు ఆయన దర్శకత్వం వహించలేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి తెలుగు అసురన్‌ షూటింగ్‌ పూర్తి అయిన నేపథ్యంలో వెంకీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.నారప్ప సినిమా మే 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

"""/"/.

అరటి పండు ఆరోగ్యానికే కాదు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.. ఎలా వాడాలంటే?