వేములవాడ బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు, కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మాణం కూడా జరుపకుండ ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల రాజకీయం కోసం పట్టణంలో డబుల్ బెడ్రూం సర్వే నిర్వహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నిరసిస్తూ అర్హులైన నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మాణం జరిపి పేద ప్రజలకు అందించాలని నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.

మంత్రి కేటీఅర్ సిరిసిల్లాకు ఒక న్యాయం వేములవాడకు ఒక న్యాయం లా వ్యవహరిస్తున్నారు.

వేములవాడ అధికార పార్టీ ఇతర పార్టీ నాయకులను కొనుగోలు చేస్తూ ప్రజలకు ఎదో అభివృద్ధి చేస్తున్నట్టు మయచేయడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు బిఆర్ఎస్ నాయకులు వేములవాడ నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఓట్లు అడగాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, నాయకులు గడ్డమీద శ్రీనివాస్, పిన్నింటి హనుమండ్లు, గుడిసె మనోజ్, రేగుల రాజ్ కుమార్,మేరుగు లక్ష్మణ్, మైలరం శ్రీనివాస్, బిళ్ల కృష్ణ, కొప్పెర సంతోష్ రెడ్డి, కోరెపు నరేష్,సగ్గు రాహుల్, తేజ గౌడ్ , కొరెపు వెంకటేష్, సగ్గు రాహుల్, చిలువేరి బాబు, ఏదుల అశోక్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆరోగ్యాన్నిచ్చే ఆల్ బుఖారా.. వర్షాకాలంలో దొరికే ఈ పండ్లను మిస్ అయ్యారో చాలా నష్టపోతారు!