'సుగుణ సుందరి'కి అదిరిపోయే రెస్పాన్స్.. అప్పుడే అన్ని మిలియన్స్ క్రాస్!

నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా 'వీరసింహారెడ్డి'.

అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

మరి మరొక 20 రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

దీంతో ఎప్పుడెప్పుడు సంక్రాంతి పండుగకు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

మరి ఇందుకు మేకర్స్ కుడి పక్కా ప్లానింగ్ తో సన్నాహాలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుండే మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా రెండు కూడా చార్ట్ బస్టర్ గా నిలుస్తున్నాయి.

జై బాలయ్య సాంగ్ తో పటు ఇటీవలే ''సుగున సుందరి'' అనే సాంగ్ ను రిలీజ్ చేసారు.

బాలయ్య, శృతి కాంబోలో వచ్చిన ఈ రొమాంటిక్ పాట ''సుగుణ సుందరి'' ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇందులో బాలయ్య ఇంకా శృతి హాసన్ లు అదిరే డ్యాన్స్ మూవ్స్ తో నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరిని థ్రిల్ చేసేసారు.

అలాగే లుక్ కూడా అదిరిపోయేలా ఉండడంతో ఈ సాంగ్ విశేషంగా ఆకట్టు కుంటుంది.

"""/"/ ఈ సాంగ్ కు మాస్ రెస్పాన్స్ రాగా అప్పుడు 10 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది.

బాలయ్య సినిమాల్లోని సాంగ్స్ ఇంత ఫాస్ట్ గా 10 మిలియన్ వ్యూస్ ను రాబట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై మరింత ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే.

అన్ స్టాపబుల్ ఫస్ట్ గెస్ట్ ఎవరో మీకు తెలుసా.. ఆ స్టార్ హీరోకే ఛాన్స్ దక్కిందా?