వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మెగా కాంపౌండ్ నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్!

తెలుగు తెరపై మెగా హీరోగా పరిచయం అయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

అయితే ఈయన విభిన్నమైన సినిమాలను చేస్తూ తన నటనలో కూడా వేరియేషన్స్ చూపిస్తు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు.

వరుణ్ మొదటి నుండి కూడా డేరింగ్ స్టెప్పులు వేస్తూ ఆడియెన్స్ ను తన నటనతో అలరిస్తున్నాడు.

గడ్డలకొండ గణేష్ తో బాగా ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఇటీవలే గని, ఎఫ్ 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇందులో గని ప్లాప్ అవ్వగా మళ్ళీ వెంటనే ఎఫ్ 3 సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు.

ఇక ఇప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకుని తన 13వ సినిమాను అనౌన్స్ చేసాడు.

వరుణ్ తన 12వ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు.ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెగ్యురల్ షూట్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా షూట్ ఇంకా స్టార్ట్ చేయకుండానే 13వ సినిమా ప్రకటించి అందరికి స్వీట్ షాక్ ఇచ్చాడు.

ఈసారి పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసి ఈ సినిమాపై అందరికి ఆసక్తి కలిగేలా చేసాడు.

"""/"/ ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చింది.

ఈ సినిమా కథ గ్లోబల్ ఇష్యుతో తెరకెక్కుతోందని ప్రతీ ప్రేక్షకుడిని మెప్పించే సినిమాగా ఇది ఉంటుంది అని సమాచారం.

అక్టోబర్ లో షూట్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాను కూడా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇక మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో విలన్ గా వినయ్ రాయ్ నటించనున్నట్టు టాక్ కూడా వస్తుంది.

కొండాపూర్‎లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల విక్రయ ముఠా అరెస్ట్..!