ఆ లక్కీ హౌస్ లో నివాసం ఉంటున్న వరుణ్ తేజ్ లావణ్య.. దశ తిరగడం ఖాయమా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ గురించి మనందరికీ తెలిసిందే.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Mega Prince Varun Tej) ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు వరుణ్ తేజ్.
ఇకపోతే వరుణ్ తేజ్ (varun Tej)హీరోగా నటించిన తాజా చిత్రం మట్కా.ఈ సినిమా నవంబర్ 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఇది ఇలా ఉంటే హీరో వరుణ్ తేజ్ కి లక్కు కొద్దిగా కలిసొచ్చినట్టుగా కనిపిస్తోంది.
తాజాగా వరుణ్ తేజ్ ఫ్యామిలీ ఒక కొత్త ఇంట్లోకి(New House) మారారు.మొన్నటి వరకు నాగబాబు (Naga Babu)ఫ్యామిలీ మణికొండ లో ఉండేవారు.
కానీ తాజాగా జూబ్లీహిల్స్ కు మారారు.అది కూడా ఒక లక్కీ హౌస్ (Lucky House)లోకి మారినట్టు తెలుస్తోంది.
ఆ హౌస్ మరి ఎవరితో కాదండోయ్.మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఒక మంచి భవంతి వుంది.
అది ప్రస్తుతం అయన వారసుల కంట్రోల్ లో వుంది.ఈ బిల్డింగ్ కట్టిన తరువాతే పివి ప్రధాని అయ్యారని అంటారు.
అలాగే ఈ భవంతిని మైత్రీ మూవీస్(Mythri Movies) సంస్థ అద్దెకు తీసుకుంది.ఉప్పెన, వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, సర్కారు వారి పాట ఇవన్నీ ఈ భవంతిలో వున్నపుడు నిర్మించినవే.
మరి ఎందుకో మైత్రీ సంస్థ ఈ భవంతిని ఖాళీ చేయాల్సి వచ్చింది. """/" /
ఇప్పుడు ఈ భవంతిని నాగబాబు(Naga Babu) కుటుంబం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల మేరకు ఖర్చు చేసి మంచి ఇంటీరియర్ అంతా చేయించినట్లు తెలుస్తోంది.