టీడీపీ కార్యకర్త హత్య పై వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్..!!

వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దాడులు ఎక్కువైపోయాయి అంటూ ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు మీడియా ముందు మొదటి నుండి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో పోలీసు వ్యవస్థను కూడా అధికార పార్టీ బ్రష్టు పట్టిస్తున్నారని.ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా తెలియజేస్తూ ఉన్నారు.

పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల తోట చంద్రయ్య అనే టిడిపి కార్యకర్త దారుణ హత్యకు గురికావడం జరిగింది.

సరిగ్గా సంక్రాంతి పండుగకు ముందు జరిగిన ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాగా తాజాగా వర్ల రామయ్య ఈ హత్యకు సంబంధించి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.

"ముఖ్యమంత్రి గారూ.మీ పాలనలో హత్యా రాజకీయాలు పెరిగి పోతున్నాయి.

అధికార పార్టీ అహంకారానికి ఒక కుటుంబం పల్నాడులో బలైంది.అందరూ సంక్రాంతి జరుపుకుంటుంటే, ఆ ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి.

ప్రశాంతంగా వుండే గ్రామాలను రాజకీయ కక్షా కేంద్రాలుగా మార్చారు.ఇదేనా రాజన్న రాజ్యం, మీరే ఆలోచించండి' అని వ‌ర్ల రామ‌య్య సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశారు.

ఐపీఎల్ 2024: సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతున్న బ్యాటర్లకు కళ్లెం వేస్తున్న టాప్ బౌలర్లు వీళ్లే..??