కరాటేలో రాణించిన వాణీనికేతన్ విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్స్ 2023 లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు.

కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలలో కటా ఈవెంట్ లో వరుణ్ రాజ్( Varun Raj ) రజతపతకాన్ని, గణేష్ కాంస్య పతాకాన్ని సాధించారు.

కెట్ ఈవెంట్ లో కౌషిక్ కుమార్ కాంస్య పతాకాన్ని అందుకున్నాడు.పాఠశాల ఆవరణలో సోమవారం రోజున ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు అభినందన సమావేశం జరిగింది.

ఈ కార్యక్రంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధి, కరాటే మాస్టర్ శరత్ లతో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ బ్లాక్ చేసిన స్కూటర్ డ్రైవర్.. జవాన్ కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగింది..?