చివరకు వెబ్ సిరీస్లకు అంకితం అవుతున్న డైరెక్టర్.. ఎవరో తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అవుతూ వస్తున్నాయి.
ఇక మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి మరోసారి మహేష్తో సినిమా చేయాలని చూశాడు.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.దీంతో తన నెక్ట్స్ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి తెరకెక్కించాలని చూశాడు.
అయితే కొన్ని కారణాల వల్ల ఇది కూడా సాధ్యం కాలేదు.దీంతో తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కించాలా అని చాలా ప్రయత్నాలు చేసినా ఏదీ వర్కవుట్ కాలేదు.
దీంతో ఇప్పుడు ఒక ఓటీటీ ప్లాట్ఫాంకు ఓ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడట వంశీ.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు చెందిన ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్ను రూపొందించేందుకు వంశీ రెడీ అవుతున్నాడట.
దీని కోసం ఒకటి కాకుండా ఏకంగా రెండు వెబ్ సిరీస్లను ప్లాన్ చేస్తున్నారట.
మొత్తానికి టాలీవుడ్ హీరోలు ఎవరూ వంశీతో సినిమాకు ఓకే చెప్పకపోవడంతో ఆయన ఇలా వెబ్ సిరీస్లకు ఓకే చెప్పాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
మరి ఈ వార్తకు ఆయన ఎలా చెక్ పెడతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఏదేమైనా వంశీ ఇలా వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టడం కూడా మంచిదే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి వంశీ ఎలాంటి కంటెంట్తో డిజిటల్ ప్రేక్షకులను మెప్పిస్తాడా అనేది చూడాలి.
బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చిన సౌత్ ఇండియా స్టార్ హీరోలు వీరే !