వకీల్ సాబ్ టికెట్ ధరల పెంపు విషయంలో బ్రేక్ వేసిన కోర్టు..!

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.

మూడు సంవత్సరాల తర్వాత కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ తో ప్రేక్షకులను అలరించానికి రేపు రాబోతున్నాడు.

ఈ నేపథ్యంలో పంపిణీ దారులకు, నిర్మాతలకు కోర్టు షాక్ ఇచ్చింది.వకీల్ సాబ్ సినిమా విడుదల అయ్యిన రెండు వారాల వరకు టికెట్ ధరలను పెంచాలని చేసిన ఆదేశాలను ఆంధ్ర ప్రదేశ్ కోర్టు తిరస్కరించింది.

కొన్ని రోజుల క్రితం పంపిణీ దారులు టికెట్ ధరల పెంపునకు అనుమతి కోరుతూ హైకోర్టులో దరఖాస్తు చేసుకుంది.

హైకోర్టు అందుకు ఆమోదం కూడా ఇచ్చింది.కానీ ఇప్పుడు కోర్టు అన్ని ఉతర్వులు రద్దు చేస్తూ ఉతర్వులు జారీ చేయడంతో పంపిణీ దారులు షాక్ అయ్యారు.

పెంచిన ధరలను మళ్ళీ యధాతధంగా కొనసాగించాలని కలెక్టర్లు నోటీసులు పంపారని తెలుస్తుంది. """/"/ ఇప్పటికే అమ్ముకున్న టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయాలనీ పంపిణీ దారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

అయితే ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.

బాలీవుడ్ లో పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు.ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.చూడాలి పవన్ ఈ సినిమాతో అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటాడో.

ఫ్యామిలీ కోసం సింహంలా పోరాడతాను.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్!