నేటి తరం రాజకీయ నేతలకు వాజ్‎పేయి ఆదర్శం..: పురంధేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మరోసారి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.వాజ్ పేయి రాజకీయ నేత కాదన్న ఆమె రాజనీతి కలిగిన వ్యక్తి అని తెలిపారు.

నేటి తరం రాజకీయ నేతలకు వాజ్ పేయి ఆదర్శమని పురంధేశ్వరి పేర్కొన్నారు.అభివృద్ధికి బీజం వేసింది వాజ్ పేయినేనని తెలిపారు.

అదేవిధంగా వాజ్ పేయి నిజమైన వారసులు బీజేపీ కార్యకర్తలేనని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వలనే దేశం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని వెల్లడించారు.

అభివృద్ధి, సంక్షేమానికి బీజేపీ మాత్రమే పెద్దపీట వేస్తుందని పురంధేశ్వరి తెలిపారు.

500 రూపాయల నోట్లపై అనుపమ్ ఖేర్ ఫోటో.. ఫోటోపై ఆయన రియాక్షన్ ఇదే!