కోలీవుడ్ అర్జున్ రెడ్డి దర్శకుడుతో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా

ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో వైష్ణవ్ తేజ్.

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ స్టార్ మొదటి సినిమాతోనే నటుడుగా మంచి మార్కులు కొట్టేశాడు.

మాసివ్ లుక్ తో మెప్పించి ఆకట్టుకున్నాడు.ఇక ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని విధంగా మొదటి సినిమాతోనే వంద కోట్లు కలెక్షన్ చేసిన హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఉప్పెన ఎఫెక్ట్ తో వైష్ణవ్ తేజ్ కి ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

పెద్ద పెద్ద బ్యానర్ లు అతనితో సినిమాలు నిర్మించడానికి ముందుకొస్తున్నాయి.ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కూడా రెడీ అయిపొయింది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.టైం చూసుకొని రిలీజ్ చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక వైష్ణవ్ మూడో సినిమా ఎవరితో ఉంటుందా అని ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో వైష్ణవ్ నెక్స్ట్ సినిమా గురించి ఒక వార్త బయటకి వచ్చింది.

అర్జున్ రెడ్డి సినిమాని తమిళ్ లో ఆదిత్య వర్మగా రీమేక్ చేసిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

సందీప్ రెడ్డి వంగ‌, నాగ్ అశ్విన్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా పనిచేసిన గిరీష‌య్య ఆదిత్య వ‌ర్మ‌తో ద‌ర్శ‌కుడిగా మారాడు.

ఇక ఈ ద‌ర్శ‌కుడు ఇటీవ‌ల వైష్ణ‌వ్‌కి ఒక క‌థ చెప్ప‌డం, ఆ హీరో ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాన‌ని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించ‌నుండ‌గా, ఏప్రిల్ 2న పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకోనున్న‌ట్లు స‌మాచారం.

దీంతో పాటు అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా నిర్మించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం అవుతాడని తెలుస్తుంది.

మెట్రోలో పాటలు పాడుతూ డ్యాన్సులు చేసిన మహిళలు.. వీడియో చూస్తే..