అందరి దృష్టి జూనియర్ తేజ్ పైనే.. పొలంలో పంట పండేనా?

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ నేడు విడుదల అయ్యింది.

సినిమాకు విమర్శకుల ప్రశంసలు అయితే దక్కుతున్నాయి.కాని కమర్షియల్‌ గా సినిమా ఆశించిన స్థాయిలో లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

గతంలో దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ఉందని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ చిత్రంగా ఈ సినిమా రూపొందినట్లుగా కామెంట్స్ వచ్చాయి.

అయితే కమర్షియల్‌ గా మాత్రం ఈ సినిమా సక్సెస్ దక్కించుకోవడం కష్టం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెగా సాయి ధరమ్‌ తేజ్ నేడు రిపబ్లిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా.

మరో వారం రోజుల్లోనే మరో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

"""/"/ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కొండ పొలం సినిమా తో ఈనెల 8న వైష్ణవ్‌ తేజ్‌ రాబోతున్నాడు.

భారీ ఎత్తున అంచనాలున్న వైష్ణవ్‌ తేజ్ కొండ పొలం సినిమా లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించింది.

ఈ సినిమా కమర్షియల్ మూవీగా కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ చిత్రంగా నావెల్‌ మూవీగా ఉంటుందని అంటున్నారు.

రిపబ్లిక్ మూవీ ఇప్పటికే అలా ఉంది.మరి కొండ పొలం అయినా కాస్త కమర్షియల్‌ టచ్‌ తో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కొండ పొలం సినిమా చిత్రీకరణ కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేశారు.క్రిష్ ఈ సినిమా లో వైష్ణవ్ ను రెండు విభిన్నమైన లుక్స్ తో చూపించబోతున్నాడు.

ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్‌ మరియు టీజర్ లు సినిమాపై అంచనాలు పెంచేసింది.

కొండ పొలం అనే ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.కొండ పొలంలో ఏం జరిగింది అనేది ఈ సినిమా కథగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

కేసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు