కోహ్లీకి యువీ బంగారు బూట్లు, ఎమోషనల్ లెటర్.. ఫొటోలు వైరల్!

మొన్నటి దాకా టీమ్ఇండియా కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇప్పుడు అన్ని కెప్టెన్సీల నుంచి వైదొలిగి సాధారణ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ విరాట్ కోహ్లీకి ఒక ఎమోషనల్ లెటర్ రాశాడు.

ఈ లెటర్ ను తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో కూడా షేర్ చేశాడు.

ఈ ఎమోషనల్ లెటర్ లో విరాట్ కోహ్లీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా, కెప్టెన్ గా ఎలా ఉన్నత శిఖరాలను అధిరోహించాడో యువీ వివరించాడు.

కోహ్లీ తన హార్డ్ వర్క్, డెడికేషన్ తో కోట్లాది మంది క్రీడాకారుల్లో ఎంతో స్ఫూర్తి నింపాడని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

ఈ లెటర్ తో పాటు విరాట్ కోహ్లీకి ఆయన గోల్డెన్ బూట్స్ బహుమతిగా అందించాడు.

ఇప్పుడు యువీ పోస్టు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.యువీ తన లెటర్ లో ఇలా రాసుకొచ్చాడు.

"యంగ్‌స్టర్‌గా నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయం నుంచే విరాట్ కోహ్లీని నేను చూశాను.

అప్పట్లో దిగ్గజ క్రికెటర్లతో భుజం భుజం రాసుకుంటూ తిరిగేవాడు.ఇప్పుడు అతను కూడా ఒక దిగ్గజ క్రికెటర్ అయిపోయాడు.

యువ క్రికెటర్ల అందరికీ అతను ఒక లీడింగ్ ఇస్తున్నాడు.క్రికెట్ గ్రౌండ్ లో కోహ్లీ క్రమశిక్షణ, ప్యాషన్, డెడికేషన్ చూస్తుంటే ఎవరికైనా సరే క్రికెట్ ఆటలో చేరిపోవాలనిపిస్తుంది.

కోహ్లీ ఏడాదికేడాది క్రికెట్ లో మరింత నైపుణ్యాలు పెంచుకున్నాడు.ఈ ఆటలో అతను ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను, ఘనతను సాధించాడు.

కోహ్లీ, నువ్వు ఒక లెజెండరీ క్రికెటర్, అద్భుతమైన కెప్టెన్ అని గుర్తుంచుకో! ఈ సమయం నుంచి నీ నుంచి మరెన్నో గొప్ప ఇన్నింగ్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను" అని యువరాజ్ సింగ్ కోహ్లీ గురించి ఒక లేఖ రాశాడు.

"""/"/ గతంలో కోహ్లీతో కలిసి యువరాజ్ ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు.ఈ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.

ఆ సన్నిహిత్యంతోనే విరాట్ కోహ్లీని చీకూ అని యువీ ముద్దుగా పిలుస్తుంటారు.ప్రస్తుతం కోహ్లీ, యువీ సంయుక్తంగా ఒక ఫేమస్ బ్రాండ్ కు ప్రచారకర్తలుగా ఉన్నారు.

అయితే ఈ బ్రాండ్ కు చెందిన గోల్డెన్ బూట్లను విరాట్ కోహ్లీ బహుమతిగా పంపించాడు యువరాజ్! లక్షలాది మంది అభిమానుల్లో చిరునవ్వులు చిందించిన మై డియరెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి గోల్డెన్ షూస్ ఇవ్వాలనుకుంటున్నానని కూడా ఆయన రాసుకొచ్చారు.

ట్రూడోకు షాకిచ్చిన భారత సంతతి నేత… ముందస్తు ఎన్నికల ముంగిట కెనడా..?