ప్రభాస్ మా బలం అంటున్న యూవీ... జాన్ కి కూడా భారీగానే

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ ఇప్పుడు తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

చివరిగా ప్రభాస్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ సాహో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా కలెక్షన్స్ భారీగా రావడంతో నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారు సేఫ్ అయ్యారు.

తెలుగు తర్వాత హిందీలో సాహో సినిమా బాలీవుడ్ హీరోలతో పోటీ పడుతూ వంద కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఓ విధంగా చెప్పాలంటే సాహో హిందీలో సూపర్ హిట్ అని చెప్పాలి.ఇదిలా ఉంటే సాహో చాయల నుంచి బయటకి వచ్చిన ప్రభాష్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టొరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాని కూడా యూవీ క్రియేషన్స్ నిర్మాతలే నిర్మిస్తున్నారు.సాహో ఎఫెక్ట్ వలన ఈ సినిమాకి బడ్జెట్ తగ్గించాలని నిర్మాతలకి కొంత మంది సన్నిహితులు సూచించిన కూడా వారు ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ప్రభాస్ తమ బలం అని అతని మీద ఎంత పెట్టుబడి పెట్టడానికి అయిన రెడీ అని ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో జాన్ సినిమా కోసం కూడా భారీ సెట్స్ నిర్మాణం కోసం రెండు వందల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే అన్నపూర్ణా స్టూడియోలో ఒకప్పటి పారిస్ సిటీ సెట్ ని కోట్ల రూపాయిలతో వేశారు.

ఈ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.దీని తర్వాత షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళడానికి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

మరి ఈ సినిమా అయినా ప్రభాస్ ని సాహో లాంటి రిజల్ట్ కాకుండా బాహుబలి లాంటి రిజల్ట్ ఇస్తుందేమో చూడాలి.

ఏపీకి ప్రధాని మోది .. ఎన్నికల టూర్ ప్లాన్ ఇలా