అక్కడ ఉన్నది శవం అనుకున్నారు.. కానీ తీరా చూస్తే..!

ఎప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒక వింత కనబడుతూనే ఉంటుంది.

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కొద్ది నిమిషాల్లో ఇట్లే ఈ ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.

అందులో చాలా వరకు అబ్బురపరిచే విషయాలు ఎక్కువగా వెలుగులోకి వస్తూ ఉంటాయి.తాజాగా ఓ సంఘటన గురించి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పెర్డిడో అనే బీచ్ లో సంభవించింది.

ఆ బీచ్ వెంబడి ఓ మహిళ సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా షాక్ కు గురైంది.

ముందుగా ఆవిడ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఓ మృతదేహం అంటూ భయపడిపోయింది.దాంతో ఆవిడ ఓ పెద్ద కేక వేసి అలా చూస్తూ ఉండిపోయింది.

ఆవిడ అలా అక్కడ ఎదురుగా ఉన్న దాన్ని చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు.

దీంతో వెంటనే పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడ ఆ శవం గురించి కనుగొనడానికి ప్రయత్నాలు చేశారు.

అయితే చాలా రోజుల నుండి సముద్రంలో ఉండే సరికి అది బాగా పాచి పట్టి ఉంది.

"""/"/ దీంతో పోలీసులు ఆ శవాన్ని సంబంధించి పూర్తిగా పరిశీలించిన తర్వాత మొత్తానికి అది శవం కాదని కేవలం ఓ బొమ్మ మాత్రమే అని చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ ముక్కు మీద వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో అక్కడి ప్రజల్లో కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి.

ఏదిఏమైనా కొన్నిసార్లు మనం మన కళ్ళతో చూసినవి నమ్మశక్యంగా లేకపోయినా వాటిని చూసి ఆశ్చర్యపోవడమో లేక భయపడిపోవడమో జరుగుతూ ఉంటాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?