భారత జాతీయ గీతాన్ని ఆలపించిన అమెరికన్ ఆర్మీ బ్యాండ్

అమెరికా సైనికుల నోట భారత జాతీయ గీతం ఆయిన జనగణమన పాటను పాడారు.

అదేంటి అమెరికా సైనికుల నోట జనగణమన ఏంటి అని అనుకుంటున్నారా.భారత, అమెరికా ల మధ్య సైనిక విన్యాసాలు జరిగాయి.

సెప్టెంబర్ 5 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు అమెరికా లోని మెకార్డ్ జాయింట్ బేస్ లూయిస్ వద్ద యుద్ధ అభ్యాస్ విన్యాసాలు చేపట్టారు.

అయితే ఈ విన్యాసాల ముగింపు రోజున అక్కడ భారత జాతీయ గీతం జనగణమన పాటను అమెరికా సైనికులు వినిపించారు.

అమెరిక‌న్ ఆర్మీ బ్యాండ్ .భార‌త జాతీయ గీతాన్ని ప్లే చేసింది.

అమెరికా సైనికులు జ‌న‌గ‌ణ‌మ‌ణ పాట‌ను త‌మ బ్యాండ్‌లో వినిపించ‌డం ప‌ట్ల భార‌తీయ సైనికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు.

అస్సాం రెజిమెంట్‌కు సంబంధించిన ఓ పాట‌పై రెండు దేశాల సైనికులు చిందులు కూడా వేసినట్లు తెలుస్తుంది.

"""/"/  ఇలా అమెరికన్ ఆర్మీ బ్యాండ్ జనగణమన గీతం ఆలపించడం అందరిని ఆకట్టుకుంటుంది.

దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అమెరికన్ ఆర్మీ కి తెగ ఫిదా అయిపోతున్నారు.

ఎన్నికల వేళ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చెప్పిన వైసీపీ..!!