ఘనంగా ఇమామ్ అలీ హమ్జా దర్గా ఉర్సు ఉత్సవాలు

పూలు, సందల్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన మతపెద్దలు మజీద్ నుంచి దర్గా వరకు బారీ ర్యాలీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఇమామ్ అలీ హఆమ్జా దర్గా వద్ద ముస్లీం మతపెద్దలు పూలు, సందల్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు , ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మజీద్ నుంచి మూడు తొవ్వలకాడి నంది విగ్రహం , కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా దర్గా వరకు ముస్లిం సదర్ సాబ్ లు , మొల్లసాబులు కలిసి ముస్లిం సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు సాదుల్లా బాయి , మండల యూత్ అధ్యక్షులు షరీఫ్ ల ఆద్వర్యంలో ఆట పాటలతో యువకుల కేరింతలతో ఆటపాటలతో నినాదాలు చేస్తూ ముస్లిం కమిటీ జెండా లను చేతభూని బారీ ఊరేగింపు నిర్వహించారు.

అనంతరం ఇమామ్ అలీ హఆమ్జా దర్గా వద్ద పూలు ,సందల్ ను సమర్పించి ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా అన్నప్రసాదం చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు,మైనార్టీ యువకులు,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్కిల్ ఉంటేనే ఎంట్రీ, కఠిన నిబంధనలు… విదేశీ విద్యార్ధులపై ఆస్ట్రేలియా కొత్త పాలసీ