త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్తి చేయాలిః మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు.

వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీల పురోగ‌తిని అడిగి తెలుసుకున్నారు.ప్ర‌తి గ్రామంలో ఆధునిక వైద్యం అందించేందుకు క్లినిక్ లు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని తెలిపారు.

మ‌రోవైపు రాష్ట్రంలో హెల్త్ క్లినిక్ లు, పీహెచ్‌సీల నిర్మాణానికి రూ.2,532 కోట్లు కేటాయించిన‌ట్లు మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని తెలిపారు.

ఈ సంవ‌త్స‌రం పూర్తి అయ్యే స‌రికి నూత‌న భ‌వ‌నాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.

త్వ‌రిత‌గ‌తిన భ‌వ‌నాల నిర్మాణాలు పూర్తి కావాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

సాయి ధరమ్ తేజ్ కి పోటీ గా వస్తున్న యంగ్ హీరో…