ఉప్పెన కాంబో రిపీట్.. మెగా ఫ్యాన్స్ కి కన్నుల పండుగ

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆ సినిమా లో హీరోయిన్ గా కృతి శెట్టి నటించిన విషయం తెల్సిందే.

ఆమెకు కూడా తెలుగు లో ఉప్పెన మొదటి సినిమానే అనే విషయం తెల్సిందే.

వైష్ణవ్‌ తేజ్ మరియు కృతి శెట్టిలు మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ తో రిజిస్ట్రర్ అవ్వడం జరిగింది.

ఇద్దరికి ఇద్దరు కూడా భలే సెట్‌ అయ్యారు అంటూ ఉప్పెన సినిమా చూసిన తర్వాత చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

"""/"/ ఉప్పెన తెచ్చిన సక్సెస్ తో ఇద్దరు కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు.

ముఖ్యంగా కృతి శెట్టి ఇప్పటికే పది సినిమాలు చేసింది.అందులో ఇప్పటికే కొన్ని విడుదల అవ్వగా మరి కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇద్దరు వారి వారి కెరీర్ లో బిజీ ఉన్న ఈ సమయంలో మళ్లీ ఎప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

"""/"/ ఉప్పెన సినిమా కాంబో రిపీట్‌ కాబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ తో కొత్త దర్శకుడు చేయబోతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది.

ఆ సినిమాలో హీరోయిన్‌ గా కృతి శెట్టిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

హీరోయిన్ గా కృతి శెట్టి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఉప్పెన సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో మళ్లీ వీరి కాంబో మూవీ వస్తే కచ్చితంగా భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయం.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సినిమా విడుదల తర్వాత ఆ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయట.

అంటే వీరిద్దరి కాంబో వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

వేసవిలో మీ జుట్టు మరింత అధికంగా ఊడుతుందా.. వర్రీ వద్దు ఇలా చెక్ పెట్టండి!