నటి ప్రియాంక చోప్రాకు స్పెషల్ థాంక్స్ చెప్పిన ఉపాసన.. ఫోటో వైరల్!

మెగా హీరో రామ్ చరణ్ ఆస్కార్ వేడుకలలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో ఎంతో బిజీగా గడుపుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక రాంచరణ్ అమెరికా వెళ్లిన నేపథ్యంలో తన భార్య ఉపాసన(upasana) కూడా అమెరికాకు వెళ్లారు.

ఇలా గత కొంతకాలంగా అమెరికాలో ఉపాసన రాంచరణ్ దంపతులు సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఉపాసన తన అమెరికా పర్యటనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటి ప్రియాంక చోప్రాతో(Priyanka Chopra) కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

"""/" / అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్నటువంటి RRR చిత్ర బృందానికి ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.

సౌత్ ఏషియన్స్ ఎక్సలెన్స్ (South Asians Excellence)పేరుతో జరిగిన ఈ వేడుకలలో మెగా కోడలు ఉపాసన కూడా పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈమె ప్రియాంక చోప్రాతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.

ఈ ఫోటోలను షేర్ చేసిన ఉపాసన లాస్ ఏంజెల్స్ ఫ్యామిలీ ఎల్లప్పుడూ మా కోసం ఉన్నందుకు థాంక్యూ ప్రియాంక అని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఇక మార్చి 12వ తేదీ లాస్ట్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి.

"""/" / ఈ ఏడాది జరగబోయే ఆస్కార్ వేడుకలకు మన దేశం నుంచి RRR సినిమాలోని నాటు నాటు పాట నామినేషన్ లో నిలిచింది.

ఈ క్రమంలోనే చిత్ర బృందం మొత్తం లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తున్నారు.

ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్(NTR) సైతం చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు.

సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ తో ఫోటోలు దిగడానికి ఉత్సాహం కనబరిచారు.ఇక సింగర్ రాహుల్ సైతం ప్రియాంక చోప్రా తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇక రామ్ చరణ్ ఇదివరకే నటి ప్రియాంక చోప్రా తో కలిసి తుఫాన్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఎన్టీఆర్ ఒక్కడే రామారావు గారి మనవడా… ఎన్టీఆర్ పై టీడీపీ నేత?