ప్రత్యూష ఆత్మహత్య గురించి ఉపాసన ఎమోషనల్.. అలా ఆలోచించాలంటూ?

ఈ మధ్య కాలంలో ప్రముఖ సెలబ్రిటీలలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రముఖ టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన ప్రత్యూష గరిమెళ్ల వార్త నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రత్యూష ఆత్మహత్య వార్త ఆమె అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు గుర్తించారు.

ప్రత్యూష గరిమెళ్ల మృతి గురించి రామ్ చరణ్ భార్య ఉపాసన ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రత్యూష గరిమెళ్ల తన డియరెస్ట్ ఫ్రెండ్ అని ఆమె పేర్కొన్నారు.ప్రత్యూష మరణం వల్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రత్యూష ప్రతి విషయంలో ఉన్నతంగా ఆలోచించేవారని ఉపాసన కామెంట్లు చేశారు.ప్రత్యూష ఫ్రెండ్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా, కెరీర్ పరంగా ఉన్నత నిర్ణయాలే తీసుకునేవారని ఉపాసన చెప్పుకొచ్చారు.

ప్రతి విషయంలో ఉన్నతంగా ఉండే ప్రత్యూష డిప్రెషన్ కు గురి కావడం తనకు బాధ కలిగిస్తోందని ఆమె కామెంట్లు చేశారు.

"""/"/ ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని తాను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రత్యూషతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉపాసన ఈ విషయాలను వెల్లడించారు.

ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. """/"/ ఎంతోమంది సినీ ప్రముఖులకు డిజైనర్ గా పని చేసిన ప్రత్యూష చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమానులను సైతం బాధ పెడుతోంది.

పోలీసులు ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.త్వరలో ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.

ప్రత్యూష సూసైడ్ నోట్ రాశారని అందులో ఇది తాను కోరుకున్న జీవితం కాదని తాను తల్లీదండ్రులకు భారంగా ఉండలేనని పేర్కొన్నారని సమాచారం.

నిరుద్యోగులకు లోకేష్ చెప్పబోయే శుభవార్త ఇదేనా ?