స్వాతంత్ర్యం అంటే ఇదేనా… గౌరవం ఎక్కడ ఉంది.. ఉపాసన పోస్ట్ వైరల్!
TeluguStop.com
నేడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ ( Independence Day ) వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ తరుణంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన( Upasana ) స్వాతంత్ర్యపు దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఇటీవల కోల్ కత్తాలో వైద్యురాలి పై జరిగిన హత్యాచార ఘటన గురించి ఈమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
"""/" /
మానవత్వం లేకపోవడం చూస్తుంటే చాలా అసహ్యం కలుగుతుంది.ఒక మహిళ వైద్యురాలి పట్ల ఇలా జరగడం చాలా బాధాకరం ఈ విషయాన్ని ఎవరు గౌరవించడం లేదు.
మన జీవితానికి ఇంకా గౌరవం ఎక్కడ ఉంది మనం ఇప్పటికీ అనాగరికత కొనసాగుతూ ఉంటే స్వాతంత్ర్యం జరుపుకోవాలా? ఒక అమ్మాయి పట్ల ఆ విధంగా ప్రవర్తించినవాడు నా దృష్టిలో మనిషే కాదు.
ఇక మన దేశంలో ఆరోగ్య సంరక్షణలో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారని తెలిపారు.
"""/" /
ఎంతోమంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావడమే నా జీవిత లక్ష్యం అయితే తాజాగా జరిగిన ఈ ఘటన ద్వారా నా సంకల్పాన్ని మరింత బలపరిచింది.
ఈ సమాజంలో ఉన్నటువంటి స్త్రీకి భద్రత రక్షణ అవసరం మనమందరం కలిసికట్టుగా ఉంటే ఈ సమాజంలో మార్పును తీసుకురావచ్చు అంటూ ఉపాసన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మనదేశంలో మహిళలకు రక్షణ లేదు అంటూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాటేసిన పామును ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసుకొచ్చి ఆస్పత్రిలో గందరగోళాన్ని సృష్టించిన యువకుడు..