వీడియో: యూపీ పోలీసు అరాచకం.. పోలీస్ స్టేషన్‌లోనే యువకుడిని బెల్టుతో చితకబాదిన వైనం..

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) జౌన్‌పూర్ జిల్లా నుంచి పోలీసుల అరాచకం వెలుగులోకి వచ్చింది.

ముంగ్రబాద్‌సాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోనే ( Police Station ) ఒక యువకుడిని దారుణంగా కొట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.వీడియోలో ఇద్దరు పోలీసులు ఒక పిల్లర్ దగ్గర యువకుడిని గట్టిగా పట్టుకోగా, మరో ఆఫీసర్ అతడిని బెల్టుతో విచక్షణారహితంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.

కొట్టిన ఆ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ( SHO ) వినోద్ మిశ్రాగా గుర్తించారు.

ఈ దాడిలో ఆ యువకుడు గాయాలపాలయ్యాడు.పోలీస్ స్టేషన్‌లోనే జరిగిన ఈ దారుణమైన ఘటన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది.

దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు భగ్గుమన్నారు.పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.

ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో, SHO వినోద్ మిశ్రాను ఆ పోస్ట్ నుంచి తప్పించారు.

అతని స్థానంలో ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్ సింగ్‌ను నియమించారు.అయితే, ఆశ్చర్యకరంగా, మిశ్రాను సస్పెండ్ చేయడమో లేదా అరెస్ట్ చేయడమో చేయలేదు.

కేవలం పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.దీన్నే 'లైన్ హాజరు' అని కూడా అంటారు.

ఇంతటి హింసాత్మక చర్యకు పాల్పడిన ఆఫీసర్‌కు ఇది చాలా చిన్న శిక్ష అని, పోలీసుల జవాబుదారీతనంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / ఈ వివాదంలో మరో అంశం కూడా ఉంది.మిశ్రా యువకుడిని కొడుతున్నప్పుడు, అతన్ని గట్టిగా పట్టుకున్న ఆ ఇద్దరు పోలీసులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ ఘటనలో వారి పాత్రపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. """/" / ఈ దాడికి గల కారణాలు కూడా షాకింగ్‌గా ఉన్నాయి.

నివేదికల ప్రకారం, ఆ యువకుడు గతంలో ఏదో అధికారిక పని కోసం SHO మిశ్రాకు డబ్బులు ఇచ్చాడని సమాచారం.

పని జరగకపోవడంతో, అతను తన డబ్బును తిరిగి అడిగాడు.ఇదే మిశ్రాకు కోపం తెప్పించింది.

దీంతో, తన కింది సిబ్బందిని ఆదేశించి, యువకుడిని స్టేషన్‌కు పిలిపించి కొట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాదు, SHO వినోద్ మిశ్రాపై గతంలోనూ చాలా ఫిర్యాదులు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే పలు కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

ఇన్ని ఉన్నా కూడా ఇప్పటివరకు అతనిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది.