దీన స్థితిలో కన్నుమూసిన గిరిజ.. కూతురు బయట పెట్టిన అసలు నిజం?

వెండితెరపై ఒకానొక సమయంలో స్టార్లుగా రాణించి ఎన్నో అద్భుతమైన అవకాశాలు అందుకుని లగ్జరీ లైఫ్ గడిపిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఆ తర్వాత కాలంలో మాత్రం ఎలాంటి అవకాశాలు రాక తీవ్ర ఇబ్బందులు పడ్డవారు చాలా మందే ఉన్నారు.

మొన్నటి తరం నటీనటులు ఇలా చివరి రోజుల్లో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా దీన స్థితిని గడిపిన చాలామంది నటీనటుల స్టోరీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.

ఇక ఇలాంటి వారిలో ఒకప్పటి స్టార్ గిరిజ కూడా ఒకరు.లేడీ కమెడియన్గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు తిరుగులేదు.

ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.అంతేకాదు ఇక గయ్యాళి పాత్రలకు అయితే ఆమె పెట్టింది పేరు.

ఇలా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ గా కొనసాగిన ఆమె చివరి రోజుల్లో మాత్రం దీనస్థితిని ఎదుర్కొంది.

అయితే గిరిజ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు రాగా.ఇక ఆమె కూతురు సలీమా మొదటిసారి ఈ వార్తలపై నోరు విప్పారు.

అందరూ అనుకున్నట్లుగా తన తల్లి గిరిజ దీనమైన స్థితిలో కన్నుమూయ లేదని.క్లారిటీ ఇచ్చింది అయితే డయాబెటిస్తో చివరి రోజులు అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అంటూ తెలిపింది.

కానీ వార్తల్లో వచ్చినట్టుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్థితిలో చనిపోలేదని అవన్నీ వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది.

ఇక ఉదయాన్నే టీ తాగి స్నానం చేసిన తర్వాత మంచం మీద పడుకొని అలాగే తుదిశ్వాస విడిచింది అంటూ చెప్పుకొచ్చింది గిరిజ కూతురు సలీమ.

ఇక అపోలో లో డాక్టర్ సత్యమూర్తితన తల్లి గిరిజకు చికిత్స ఇచ్చేవారు అంటూ సలీమా చెప్పుకొచ్చారు.

ఇక అంతే కాకుండా తన తల్లి అంత్యక్రియలకు ఎవరూ ఇండస్ట్రీ వారు రాలేదు అంటూ చెప్పుకొచ్చారు.

కానీ ఆ తర్వాత రోజు శోభన్ బాబు గారికి ఫోన్ చేసి బాధపడకు నీకు మేము అండగా ఉంటామని.

ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు అంటూ సలీమా చెప్పుకొచ్చింది. """/"/ ఏ ముహూర్తాన మా అమ్మకి సన్యాసిరాజు పరిచయమయ్యాడో అప్పటి నుంచి మా అమ్మ జీవితం నాశనం అయింది.

ఎన్నోసార్లు తాగి వచ్చి మా అమ్మను కొట్టేవాడు అందుకే అతడిని తండ్రి అని పిలవడం కూడా నాకు నచ్చదు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తల్లికి జరిగింది చూసిన తర్వాత ఇక తాను కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న అంటూ చెప్పుకొచ్చింది.

కృష్ణ, శోభన్‌బాబు మధ్య ఏం జరిగింది.. మల్టీస్టారర్ సినిమాలు చేయడం ఎందుకు మానేశారు ?