అన్ స్టాపబుల్లో కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఆహాలో అన్ స్టాపబుల్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు వెండితెర పై అలరించిన బాలయ్య, ప్రస్తుతం బుల్లితెరపై కూడా అదేరీతిలో తన సత్తాను కొనసాగిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇకపోతే ఈ షోకి మొదటి గెస్ట్ గా మోహన్ బాబు ఫ్యామిలీ రాగా, అనంతరం హీరో నాని వచ్చి సందడి చేశారు.

ఇటీవలే మూడవ ఎపిసోడ్ కి దర్శకుడు అనిల్ రావిపూడి, టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం షోకి వచ్చి రచ్చ రచ్చ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా 4 ఎపిసోడ్ కి ప్రిన్స్ మహేష్ బాబు బాలకృష్ణ తో సందడి చేసినట్లు తెలుస్తోంది.

ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఈ ఎపిసోడ్ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

"""/" / ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకె షో రికార్డు వ్యూస్ పొందుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవల ఈ షోలో అఖండ సినిమా టీమ్ పాల్గొన్నారు.ఈ క్రమంలోనే బాలయ్య చిత్ర యూనిట్ తో మాట్లాడుతూ పంచులు వేస్తూ, సందడి చేశారు.

తప్పుడు ప్రచారంచేస్తూ వెన్నుపోటు పొడిచారని.చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని ప్రోమోలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారుNTR, CBN ఎపిసోడ్ల పై మాట్లాడినట్టు తెలుస్తోంది.

ఈనెల 10న ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది.

అమెరికా : స్కూళ్లలోకి టీచర్లు హ్యాండ్‌ గన్ తీసుకెళ్లేలా .. కీలక బిల్లుకు టెన్నెస్సీ ఆమోదం