కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి నీ కలిసిన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : కరీంనగర్ పార్లమెంటు( Karimnagar Parliament ) సభ్యుడు,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సనుగుల ఈశ్వర్ శనివారం కలిసి పుష్పగుచ్చం అందించి భగవద్గీత ను ప్రధానం చేయడం జరిగింది.

ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రెటరీ చందుపట్ల లక్ష్మారెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ కి పరిచయం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యువమోర్చా ఉపాధ్యక్షుడు రాజు యాదవ్, ఎస్సీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి బర్క వేణు, ఎండి అబ్దుల్ మియా తదితరులు ఉన్నారు.

మనసంతా నువ్వే దర్శకుడిని ఆ సంస్థ నిజంగానే తొక్కేస్తుందా?