తిరుమల తిరుపతి లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి లో శ్రీవారిని దర్శించుకున్నారు.

విఐపి దర్శన సమయంలో కిషన్ రెడ్డి తో పాటు మరి కొంత మంది  దర్శించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి దర్శనానంతరం శ్రీ రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుత దేశంలో పరిస్థితులు చక్కబడలని, మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని స్వామివారిని కోరుకున్నట్లు ప్రార్థించినట్టు స్పష్టం చేశారు.

ఈ క్రమంలో కిషన్ రెడ్డితో పాట ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, అదే రీతిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరికొంతమంది ఉన్నారు.

 విఐపి దర్శనం కావటంతో టీటీడీ అధికారులు దగ్గరుండి కేంద్రమంత్రి తో పాటు మిగతా వారికిఅన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది.

 ఇదే సమయంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ (స్విమ్స్) వద్ద జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ విధానాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.

రాత్రిపూట‌ ఐస్ క్రీమ్ తింటున్నారా.. నో డౌట్ మీ ఆరోగ్యం మ‌టాష్!