కేంద్ర మంత్రి బండి సంజయ్ కీ కరీంనగర్ పార్లమెంటు సరిహద్దు శనిగరం లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ కోహెడ మండలం శనిగరం స్టేజి వద్ద తేదీ 19-06-2024 బుధవారం ఉదయం 8:గంటలకు సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు గంగిడి మోహన్ రెడ్డి సారథ్యంలో బిజెపి కోహెడ మండలశాఖ నేతృత్వంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ స్వాగతం కార్యక్రమానికి కోహెడ మండలంలోని 27 గ్రామాలలోని వివిధ బాధ్యతల్లో ఉన్న బిజెపి శ్రేణులు పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొని బండి సంజయన్న కి పార్లమెంట్ పరిధిలో తొలి ఘన స్వాగతం పలకాలని పేరుపేరునా పార్టీ శ్రేణులకు తెలియజేశారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ షెడ్యూల్ తేదీ : 19 జూన్ 2024, బుధవారం ఉ: 9 గం.

లకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శనిగరం చేరుకుంటారు.అనంతరం క్రింది ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మహాశక్తి ఆలయం, కరీంనగర్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, నల్లగొండ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, సిరిసిల్ల మార్కండేయ స్వామి ఆలయం లను దర్శిస్తారు.

త్రివిక్రమ్ సునీల్ 30 రూపాయల అనుభవం తెలుసా.. ఇన్ని కష్టాలు అనుభవించారా?