తుంగతుర్తిలో షర్మిలకు అవమానం-చెప్పులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

సూర్యాపేట జిల్లా:జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ టిపి అధ్యక్షురాలువై.

ఎస్.షర్మిలకు ఘోరమైన అవమానం జరిగింది.

ఆమెపై కొందరు ఆకతాయిలు చెప్పులు విసిరారు.ఈ సంఘటన బుధవారం తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

అడ్డుకోవడమే కాకుండా షర్మిలపై చెప్పుల దాడి కూడా చేశారని,ఈదాడి వెనుక రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి హస్తం ఉందని వైఎస్ ఆర్ టి పి నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నాయకులను మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఉసిగొల్పారని ఆరోపించారు.

ఈ ఇరువురి ఆదేశాలతో వీధి రౌడీల్లా మారిన టీఆర్ఎస్ నాయకులు ఆమెపై దాడి చేశారని, తమ పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలపైనా దాడులు చేశారని,ఒక మహిళా నాయకురాలి చేతికి తీవ్ర గాయం అయిందని తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారని వారు ఆరోపించారు.

అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి, డిసెంబర్‌లో పెళ్లి.. అంతలోనే ఘోరం