ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో అనిశ్చితి..!!

ఏలూరు జిల్లా పాలకొల్లులో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) బస చేసిన ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

ఉండి నియోజకవర్గ కార్యకర్తలు నిరసనకు దిగారు.ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు( MLA Ramarajuku ) టికెట్ కేటాయించాలని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ క్రమంలోనే రామరాజుకు సీటు ఇవ్వకుంటే నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేస్తామని అనుచరులు, పార్టీ క్యాడర్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఉండి నియోజకవర్గ టీడీపీ సీటును రఘురామకృష్ణ రాజుకు( Raghuramakrishnarju ) కేటాయిస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు సమక్షంలో రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఉండి టీడీపీ సీటును ఎవరికి కేటాయిస్తారనే దానిపై అనిశ్చితి కొనసాగుతోంది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మూడోతరం వారసుడు.. అవ్రామ్ లుక్ పై విష్ణు ఎమోషనల్ పోస్ట్!