ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు.. ఆ ముగ్గురు దర్శకులతో ఏం మాట్లాడాడో తెలుసా?

ఉదయ్ కిరణ్ మరణం.ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేనిది.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ తెలుగు ఇండస్ట్రీలో మరో మెగా స్టార్ అవుతారు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రమే కాదు ఆయన జీవితం కూడా అర్థంతరంగా ముగిసిపోయింది.

తక్కువ సమయంలోనే బ్లాక్బస్టర్ సినిమాలతో హిట్ కొట్టారు.యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ జీవితం ఎవరూ ఊహించని విధంగా అస్తమించింది.

"""/"/ ఉదయ్కిరణ్ మంచితనం నచ్చి కింద మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మితను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు.

నిశ్చితార్థం కూడా జరిగింది.కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది.

అక్కడి నుంచి ఉదయ్ కిరణ్ కెరీర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది.అయితే ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు విఎన్ ఆదిత్య ఇంటర్వ్యూలో తనకు ఉదయ్ కిరణ్ కి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని చెప్పుకొచ్చాడు.

ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు రోజు రాత్రి మూడు గంటల పాటు ఫోన్లో మాట్లాడాను.

నేను బాధ పడుతూ ఉంటే ఆయన ఓదార్చారు.భవిష్యత్తులో తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ ధైర్యం చెప్పారు.

ఈ మాటలు విన్నాక డిప్రెషన్ నుంచి బయటికి వచ్చాను.కొండంత ధైర్యం కూడా వచ్చింది.

"""/"/ ఇలా నాకు ధైర్యం చెప్పిన వ్యక్తి ఆ తర్వాత రోజే ఆత్మహత్య చేసుకుంటాడు అన్నది అస్సలు ఊహించలేకపోయాను.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు.కానీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్నది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న అంటూ మనసంతా నువ్వే దర్శకుడు వి.

ఎన్ ఆదిత్య చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.ప్రతిరోజు రాత్రి తనతో పాటు తేజ, పూరి జగన్నధ్ దర్శకత్వం లో ఉదయ్ కిరణ్ ఫోన్లో మాట్లాడాడు.

ఇక అదే ఆయన చివరి మాటలు అవుతాయని ఎవరూ ఊహించలేకపోయారు అంటూ కన్నీరుమున్నీరయ్యాము దర్శకుడు ఆదిత్య.

కొడాలి నాని, బుగ్గన నామినేషన్లకు ఆమోదం..!!