వనభోజనాలకు వెళ్ళి తిరిగొస్తుండగా ట్రక్కు బోల్తా ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కల్మల చెరువు శివారులో ట్రాక్టర్ లో వనభోజనాలకు వెళ్ళి తిరిగొస్తుండగా ట్రక్కు బోల్తా పడి మనీషా (18), చంద్రమ్మ(65) అక్కడిక్కడే మృతి చెందగా,మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 15 మంది ఉన్నట్లు సమాచారం.గాయపడిన వారిని హుటాహుటిన హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

ఆదివారం కల్మలచెరువు గ్రామంలో ముత్యాలమ్మ పండుగ సందర్భంగా వన భోజనాలకు వెళ్ళి ముగించుకొని ఇంటికి వస్తుండగా విషాదం జరిగినట్లు తెలుస్తుంది.

స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న చిరంజీవి…