రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో శనివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారులో నలుగురు వ్యక్తులు కరీంనగర్ నుంచి విజయవాడకు వెళుతున్న క్రమంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలకేంద్రానికి రాగానే కారు అదుపుతప్పి గోడకు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో విక్రం, రమేష్ స్పాట్ లో మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.