టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
TeluguStop.com
తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా మరో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.భగవంత్, రవికుమార్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి పేపర్ ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
తన తమ్ముడి రవికుమార్ కోసం రూ.2 లక్షలకు ఏఈ పేపర్ భగవంత్ కుమార్ కొనుగోలు చేశారు.
కాగా వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో భగవంత్ విధులు పని చేస్తున్నాడు.డాక్యా నాయక్ ఖాతాలో లావాదేవీల విచారణలో ఈ విషయం బయటకు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడా..?