దారుణం : విద్య చెప్పాల్సిన గురువులే ఆ యువతిపై..

ఈ మధ్య ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడంలేదు.అమ్మాయి కనిపిస్తే చాలు.

మానవత్వం మరచిపోయి వాళ్లపై లైంగిక దాడి చేస్తున్నారు.తాజాగా జరిగిన ఒక ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.

విద్య చెప్పాల్సిన గురువులే విద్యార్థిపై లైంగిక దాడి చేసారు.విందు అని చెప్పి ఇంటికి పిలిచి ఇద్దరు లెక్చరర్లు ఆ యువతిపై లైంగిక దాడి చేసారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.మాదాపూర్ పోలీసులు ఈ ఘటనపై ఇద్దరు లెక్చరర్లపై కేసు నమోదు చేసారు.

హైదరాబాద్ రాంనగర్ లోని ఒక కాలేజీ లో అల్వాల్ ప్రాంతానికి చెందిన ఒక యువతీ చదువుకుంటోంది.

ఆ యువతిపై ఆ కాలేజ్ లో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కళ్యాణ్ వర్మ కన్ను పడింది.

కళ్యాణ్ వర్మ మరొక లెక్చరర్ తో కలిసి ఆ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ నేపథ్యంలో కళ్యాణ్ వర్మ తన ఇంట్లో జరిగే విందుకు హాజరవ్వాలని జనవరి 29న ఆ యువతిని ఆహ్వానించాడు.

ఆ యువతి తన సోదరుడితో కలిసి మాదాపూర్ లోని కళ్యాణ్ వర్మ ఇంటికి వెళ్ళింది.

అయితే కళ్యాణ్ వర్మ ఆ యువతీ సోదరుడిని బయటే ఉండాల్సిందిగా చెప్పాడు.తర్వాత ఆమెతో కొద్దీ సేపు మాట్లాడాడు.

తర్వాత కళ్యాణ్ వర్మ అక్కడే ఉన్న మరొక లెక్చరర్ రవీందర్ తో కలిసి అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.

ఈ నేపథ్యంలో ఆ యువతీ వారి నుండి తప్పించుకుని పారిపోయింది.ఆ యువతి ఫిబ్రవరి 9 న తనపై జరిగిన లైంగిక దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.యువతి చదువుతున్న కాలేజ్ డైరెక్టర్ ఈ ఘటన తన దృష్టికి రాగానే ఆ ఇద్దరు లెక్చరర్లను ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలిపారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు.. రాజమౌళి కామెంట్లకు ఫిదా అవ్వాల్సిందే!