షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇల్లు దగ్ధం.. 50 కిలోల బియ్యాన్ని వితరణ చేసిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మేకల బిక్షపతి,మేకల మురళిలు గురువారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధం కాగా వారికి తంగళ్ళపల్లి సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, శుక్రవారం రోజున 50 కిలోల బియ్యాన్ని వితరణ చేశారు.

ఆమె మాట్లాడుతూ ఇల్లు దగ్ధం కావడంతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు.

ఈ విషయాన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని వారు బాధితులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి,బిఆర్ఎస్ నాయకులు జగన్, అనిల్ ఇతరులు పాల్గొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హారిస్.. తమిళనాడులోని ఆ గ్రామంలో సందడి