శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఎంపీ వైద్యం వికటించి ఇద్దరు మృతి

శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవల చెరువులో విషాదం నెలకొంది.ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి ఇద్దరు మృత్యువాత పడ్డారు.

మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఈ ఘటన ఓడీసీ మండలం కుంట్లపల్లిలో చోటు చేసుకుంది.

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న సుమారు 40 మంది ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించారు.వీరందరికీ ఇంజక్షన్ ఇవ్వగా రెండు రోజులకు నడవలేని స్థితికి చేరుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే వైద్యం వికటించి రాత్రి ఇద్దరు మృత్యువాత పడ్డారు.మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

మృతులు పొప్పూరప్ప, రామప్పలుగా గుర్తించారు.

Viral Video : వీడియో: గర్ల్స్ హాస్టల్‌లోకి దూరిన యువకుడు.. అడ్డంగా బుక్కయ్యాడు..