రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి( Shatraj Palli )లో పిడుగుపాటుతో కంబల్ల శ్రీనివాస్ (30) అనే వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి.

స్థానికులు గాయాల పాలైన వారిని వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అలాగే తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్ లో పిడుగుపాటుతో చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం నుండి ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది.

రుద్రారపు చంద్రయ్య అనే రైతు( Farmer ) తన పొలం వద్ద పొలం పనులు చేసుకుంటుండగా పిడుగు పడి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

చంద్రయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అన్నను నిర్మాతగా నిలబెడుతున్న ఎన్టీఆర్.. భారీ లాభాలను అందిస్తున్నాడుగా!