చిన్నారుల ప్రాణం తీసిన దాగుడుమూత‌లు.. !

తెలిసి తెలియని వయస్సులో ఆడుకునే ఆటలు చిన్నపిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి.నిన్నటికి నిన్న ఒక పాప ఆటలాడుకుంటూ తల్లిచీర మెడకు చుట్టుకుని మరణించిన ఘటన మరవక ముందే మరో ఇద్దరు చిన్నారులు కూడా ఇదే తీరుగా మృత్యు వాతపడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు చూస్తే.మహబూబ్‍ నగర్‍ జిల్లాలోని నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామంలో విగ్నేశ్‌, ప్రశాంత్‍ అనే ఇద్దరు చిన్నారులు త‌మ స్నేహితుడు శివతో క‌లిసి ఓ గ‌డ్డివాము వ‌ద్ద దాగుడు మూతలు ఆడుకున్నారు.

ఈ క్రమంలో విగ్నేశ్, ప్రశాంత్ అనే పిల్లలు ఇద్ద‌రూ వెళ్లి గడ్డివాములోకి దూరి శివ‌కు క‌న‌ప‌డ‌కుండా దాక్కున్నారు.

అదే స‌మ‌యంలో ఊహించని విధంగా ఆ గడ్డి వాముకు నిప్పు అంటుకోవ‌డం జరిగింది.

కాగా స్థానికులు ఈ విష‌యాన్ని గమనించి ఇద్ద‌రు చిన్నారుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.కానీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ విగ్నేశ్, ప్రశాంత్ ప్రాణాలు విడిచారు.

అయితే ఈ ప్రమాదాన్ని ఊహించని ఆ పిల్లల స్నేహితుడే గ‌డ్డివాముకు నిప్పు అంటించి ఉండొచ్చ‌ని స్థానికులు అనుమానిస్తున్నారు.

ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారట.

రెబల్ అభ్యర్థులపై టీడీపీ సస్పెన్షన్ వేటు..!