పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి

సూర్యాపేట జిల్లా:చిలుకూరు మండల కేంద్రంలోని పాత చిలుకూరులో శనివారం కురిసిన వర్షానికి పిడుగుపడి కొండా ఎల్లయ్య అనే రైతుకు చెందిన రెండు పాడిగేదెలు మృతి చెందాయి.

మృతి చెందిన గేదెల విలువ సుమారు 1లక్ష 50వేల రూపాయలు ఉంటుందని,తమకు ప్రకృతి తీవ్ర అన్యాయం చేసిందని బాధిత రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు.

గేదెల పాడిపై ఆధారపడి జీవిస్తున్న తాము జీవనోపాధి కోల్పోయామని,ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

దేవర 2 పై కీలక వ్యాఖ్యలు చేసిన నటుడు అజయ్… నా పాత్ర అలాంటిదంటూ?