నిర్మాతల ఒత్తిడిలో నాని..!

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉంది.

ఏప్రిల్ 23నే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డది.

ఇక ఈమధ్య సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వచ్చాయి.అయితే తెలంగాణాలో థియేటర్లు ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఏపీలో పెంచిన టికెట్ల రేట్లు తగ్గించే వరకు థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచన లేరు థియేటర్ యాజమాన్యాలు.

ఈ క్రమంలో టక్ జగదీష్ నిర్మాతలు కన్ ఫ్యూజన్ లో పడ్డారు.ఓ పక్క నాని టక్ జగదీష్ సినిమాకు ఓటీటీ ల నుండి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలో నాని మీద నిర్మాతల ప్రెజర్ చేస్తున్నారని టాక్.డైరక్టర్ శివ నిర్వాణ కూడా సినిమా ఓటీటీ రిలీజ్ కు మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు.

నాని మాత్రం తన సినిమా ఓటీటీ రిలీజ్ కు నో చెబుతున్నాడట.ఇంకొద్దిరోజులు ఆగయినా సరే థియేట్రికల్ రిలీజ్ చేయాలని అంటున్నాడట.

ఈ నెల చివరన తిమ్మరుసు, ఇష్క్ సినిమాల రిలీజ్ లు ఉన్నాయి.ఆ సినిమాల ఫలితాలను బట్టి నెక్స్ట్ సినిమాల రిలీజ్ లు ఉంటాయని తెలుస్తుంది.

నాని మాత్రం టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ కు ఒప్పుకోవట్లేదని టాక్.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున టక్ జగదీష్ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటించారు.

భార్య మంగళ సూత్రం అమ్మి పేకాట.. ఆ వ్యక్తికి పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించారా?