తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త చెప్పింది.స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేసింది.

అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.

వీటితో పాటు అక్టోబ‌ర్ నెల క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, స‌హ‌స్ర దీపాలంక‌ర‌ణ త‌దిత‌ర వ‌ర్చువ‌ల్ సేవ‌ల ద‌ర్శ‌న కోటా టికెట్ల‌ను సాయంత్రం 4 గంట‌ల‌కు ఆన్ లైన్ లో విడుద‌ల చేయ‌నున్నారు.

ఆర్జిత సేవ కోసం మొత్తం 54 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.ఈ నేప‌థ్యంలో భ‌క్తులు ఆన్ లైన్ లో స్వామివారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు తెలిపారు.

శివ కార్తికేయన్ కొడుకు బారశాల.. వైరల్ అవుతున్న స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్!