తిరుమలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు కమిటీని నియమించిన టిటిడి..

ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు నిపుణులచే గుర్తించి వాటికి మరమ్మత్తులు చేపడుతాము.

తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ పై కమిటీని నియమించాము.లడ్డు కవర్లు బయోడిగ్రేడబుల్ అయినవి ఏర్పాటు చేసాము అని టిటిడి ఈఓ జవహర్ రెడ్డి అన్నారు.

త్వరలోనే తిరుమలలో అన్ని దుకాణాలలో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటాము.హనుమాన్ జన్మస్థలం అభివృద్ది చేస్తాము.

హనుమాన్ జన్మస్థలం లో ఫిబ్రవరి 16 , ఉదయం 9:30 భూమి పూజ నిర్వహిస్తాము.

తరిగొండ వెంగమాంబ బృదవనం పనులు ఫిబ్రవరి16 ప్రారంభిస్తాము.అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరి15 తర్వాత ఆఫ్ లైన్ సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తాము.

స్వామివారి సేవలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొంటాము.శ్రీవారి దర్శన టికెట్ల కొరకు టిటిడి వెబ్సైట్ వాడండి, నకిలీ వెబ్సైట్ నమ్నకండి.

ఏపీలోకి సీబీఐ ఎంట్రీ .. జగన్ కోసమేనా ?