అల్లు అర్జున్ కు షాక్.. అన్నీ ఆపేయాలంటూ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సజ్జనార్?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప.

ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్లకు,సాంగులకు భారీగా స్పందన లభించింది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ రెండు మూడు యాడ్ లలో నటించినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో యాడ్ బన్నీని చిక్కుల్లో పడేసింది.ఈ అడ్వటైజ్మెంట్ తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు ఇప్పటికే లీగల్ నోటీసులు అందాయి.

దీనితో ఈ అడ్వర్టైజ్మెంట్ లో తెలంగాణ ఆర్టీసీ బస్సులను చూపించిన క్లిప్ ను తొలగించి యాడ్ ను ప్రచారం చేస్తోంది.

"""/"/ కాగా ఈ ప్రకటనను పూర్తిగా నిలిపి వేయాలని ఆదేశించింది లోకల్ కోర్టు.

యూట్యూబ్ లో ఉన్న ఇందుకు సంబందించిన వీడియోలను కూడా రిమూవ్ చేయాలనీ సూచించింది.

ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను ఉల్లంగిస్తే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు టీఎస్ఆర్టీసి ఎండి సజ్జనార్.

కంపెనీలు తమ ప్రకటనలను రూపొందించే విధానంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఇతరుల పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అని తెలిపారు.

నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన.. ఉద్రిక్తత