టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణ రేపటికి వాయిదా

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది.కేసు విచారణను రేపటికి వాయిదా వేయాలంటూ బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కరుణాకర్ తెలంగాణ హైకోర్టును కోరారు.

ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని న్యాయస్థానానికి తెలిపారు.

మరోవైపు ఇదే కేసులో నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో పిటిషన్ల విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

కాగా ఈ వ్యవహారంపై సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తలస్నానం చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ ను పాటిస్తే మీ జుట్టు సిల్కీగా, షైనీగా మెరిసిపోవడం ఖాయం!