డిపో మేనేజర్లకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ఆదేశాలు

తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో డిపో మేనేజర్లకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

మొదటి వారం రోజులు కండక్టర్లు, డ్రైవర్లు సంయమనం పాటించాలని ఎండీ సజ్జనార్ సూచించారు.

మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మీ పథకం లో భాగంగా రేపటి నుంచి బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం అమలు కానుంది.

తెలుగులో స్టార్ హీరోలైనా సరే.. ఇవి చేయడం మాత్రం వీరి చేత కాదు..?