పెరిగిన వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ధర్నా..

జూబ్లీహిల్స్: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ మీద పెంచిన తరాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాలలో భాగంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో యూసుఫ్ గూడా చౌరస్తాలో కార్పొరేటర్లు మహిళా కార్యకర్తలతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి గ్యాస్ సిలిండర్ల తో తమ నిరసన తెలిపి దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి తమ నిరసనలను పెద్దఎత్తున వ్యక్తం చేసిన కార్యకర్తలు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ వెంటనే కేంద్రం పెంచిన ధరలను తగ్గించాలని బీజేపీ పార్టీ తమ శక్తిని సామాన్య ప్రజలపై కాకుండా దేశంలో ఉన్న సమస్యలపై చూపించాలని మరియు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని హెచ్చరిస్తూ బండి సంజయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నువ్వు ప్రజల సమస్యలపై కేంద్రం లో ఎందుకు వివరించారు అని ప్రశ్నించారు.

కార్తీ సత్యం సుందరం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా?