మునుగోడులో గెలుపు దిశగా దూసుకుపోతున్న టీఆర్ఎస్..

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.ధ్యాహ్నం 2 గంటల సమయానికి 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.

ఇంకా 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యత కనబరచిన టీఆర్ఎస్.

ఆ తర్వాత 2, 3 రౌండ్లలో వెనుకబడింది.అయితే తిరిగి 4 వ రౌండ్ లోనే ఆధిక్యంలోకి దూసుకువచ్చిన టీఆర్ఎస్ వరుసబెట్టి ప్రతి రౌండ్ లోనూ మెజారిటీ సాధిస్తూ సాగుతోంది.

8వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి టీఆర్ఎస్ కు 52,334 ఓట్లు రాగా.

బీజేపీకి 49,243 ఓట్లు వచ్చాయి.ఇక కాంగ్రెస్ కు 13,689 ఓట్లు వచ్చాయి.

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 3,091 ఓట్ల మెజారిటీతో ముందు ఉన్నారు.

రూ.1000 కోట్లు సాధించిన కల్కి.. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ సినిమాలు ఈ రికార్డ్ బ్రేక్ చేస్తాయా?