త్రివిక్రమ్ సినిమా తారక్కు రెండో ఆప్షన్ అట!
TeluguStop.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ మూవీని అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాను లాంఛ్ కూడా చేశారు చిత్ర యూనిట్.తారక్ కెరీర్లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా కోసం తొలుత త్రివిక్రమ్ రెండు కథలను రాసుకున్నాడట.
అయితే మొదట ఓ కథను వినిపించగా, తారక్కు అది నచ్చలేదట.దీంతో రెండో కథను త్రివిక్రమ్ వినిపించగా, దాన్ని ఓకే చేశాడట.
ఇలా ‘అయినను పోయిరావలె హస్తినకు’ చిత్రాన్ని తారక్ ఓకే చేశాడని తెలుస్తోంది.మరి త్రివిక్రమ్ రాసుకున్న తొలి కథను ఎవరికి వినిపిస్తాడా, అందులో హీరోగా ఎవరు నటిస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా, తారక్ ఇందులో పొలిటిక్ బ్యాక్డ్రాప్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోండగా, అందులో పూజా హెగ్డే, జాన్వీ కపూర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మరి ఈ సినిమాలో తారక్తో ఎవరు రొమాన్స్ చేస్తారో చూడాలి.ఇక అతి త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాతే త్రివిక్రమ్ చిత్రంలో నటించాలని భావిస్తున్నాడట.
సిద్దు జొన్నలగడ్డ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతుంది…